రాజంపేటలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమము

  • రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట మండలంలో జనసేన కార్యకర్తల క్రియాశీలక సభ్యత్వ మరియు ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ

రాజంపేట నియోజకవర్గం, రాజంపేట ఇన్చార్జి మలిశెట్టి ఆదేశాల మేరకు రాజంపేట జనకార్యకర్తలు రాజంపేట పార్టీ ఆఫీస్ లో జనసేన రాజంపేట మండల కార్యకర్తల జనసేన కియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమము జరిగింది. పంపిణి కార్యక్రమములో జనసేన కార్యకర్తలు విరివిగా పాల్గొని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యణ్ ఈ ఇన్సూరెన్స్ సభ్యత్వం కార్యకర్తలకు భరోసాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్యకర్తలు సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా రాజంపేట మండల జనసేన కార్యకర్త యాక్సిడెంట్ లో చనిపోయిన పాచికల బుజ్జయ్యకు తప్పక న్యాయం జరుగుతుందని జనసేన నాయకులు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో కౌలు రైతలను ఆదుకుంటుంటే వైసిపి నాయకులకు కడుపుమంటగా ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలందరు పవన్ కళ్యాణ్ సిఎం కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. జనసేన ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రాజంపేట జనసేన కార్యకర్తలతో పాటు, జనసేన రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ముకురం చాంద్, రాష్ర చేనేత వికాస కార్యదర్శి రాతాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, మరియు ఎం వెంకటేశ్వరరావు, తాళ్ళపాక శంకరయ్య, బండ్లరాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు మరియు ఇతరులు పాల్గొని కాబోయే సిఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం చేస్తారని తెలియజేశారు.