ఆమదాలవలస, జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం శక్తివంతంగా కొనసాగుతుండగా, తాజాగా ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది సమక్షంలో, క్రియాశీలక వాలంటీర్లకు సభ్యత్వ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ , ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు వాలంటీర్లకు సభ్యత్వ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, “దేశంలో ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించేలా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు,” అని పేర్కొన్నారు. గతంలో ఈ కార్యక్రమం ద్వారా పలువురు కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా చెక్కులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి సభ్యత్వ కార్డుల పంపిణీ నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందిద్వారా జరగడం మరింత విశ్వసనీయతను అందించిందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్రియాశీలక వాలంటీర్లు పాల్గొన్నారు.
Share this content:
Post Comment