క్రియాశీలక సభ్యత్వంతో జన సైనికులకు భరోసా: రాటాల రామయ్య

*జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేసిన రాటాల రామయ్య

సిద్ధవటం: దేశంలో ఏఒక్క రాజకీయ పార్టీ కల్పించని సౌకర్యం జనసేన పార్టీ కల్పించిందని.. క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా కల్పిస్తోందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేనపార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. బుధవారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో శుభ పరిణామన్నారు. ఈ సభ్యత్వంతో పాటుగా సభ్యులకు ఏదేని ప్రమాదానికి గురైతే తక్షణమే వారి కుటుంబానికి అండగా 50.వేల రూపాయలు ఆస్పత్రికి నేరుగా పంపిస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయల సహాయాన్ని నిరాశ్రయులైన కుటుంబానికి అందజేయడం జరుగుతుందన్నారు. జనసైనికులు అందరూ.. నిత్యం పార్టీ కోసం కృషి చేస్తూ.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలన్నారు.