జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

*సత్తుపల్లిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ మరియు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

సత్తుపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు.. ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి సూచనలు మేరకు.. జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో.. సత్తుపల్లి పట్టణంలో.. కళా భారతి ఆడిటోరియంలో.. క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ మరియు సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి కిట్లను అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణం, కిష్టారం, కాకర్లపల్లి గ్రామాలకు సంబంధించిన పలువురు జనసేన పార్టీ ఆశయాలు నచ్చి పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన విభాగం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ శెట్టి సాయికుమార్, వీరమహిళ విభాగం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు హరిప్రియ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు శివాజీ మిరియాల, సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు ఆళ్ల నరేష్, కొమ్మగిరి శరత్, కళ్యాణ్ కిషోర్, జిల్లెల మహేష్, చక్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సభ్యులు దినేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కోర్దినేటర్స్ జాబీర్ సయ్యద్, రాము యద్దనపూడి, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.