కొత్తపల్లిలో ఘనంగా జనసేన క్రియశీలక సభ్యత్వ కిట్లు పంపిణి కార్యక్రమం..
కైకలూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొత్తపల్లిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా.. భారీగా సభా స్థలానికి చేరుకున్న కైకలూరు నియోజకవర్గం నాయకులు, జనసైనికులు మరియు జిల్లా అధ్యక్షులైన బండ్రెడ్డి రామ్ కొత్తపల్లిలోని ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేసి.. పాదయాత్రగా భారీ జనసమూహంతో ర్యాలీగా వెళ్లి డా. బి ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభాస్థలానికి చేరుకుని.. కార్యక్రమంలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లడుతూ.. కొత్తపల్లి జనసైనికుల సేవలు మరువలేనివని.. ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు సాగాలి అని.. అలానే అన్ని గ్రామాలు కూడా కొత్తపల్లి జనసైనికులని ఆదర్శంగా తీసుకుని.. నిత్యం ప్రజల్లో ఉండాలి అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నూటికినూరు శాతం జనసేన పార్టీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అన్ని కులాలు వారు బడుగు బలహీనవర్గ ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం అని.. జనసేన పార్టీకి విశేష స్పందన లభిస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గంలోని రాష్ట్ర కార్యవర్గం 4 మండలాల జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్తపల్లి జనసైనికులు మాట్లడుతూ.. మాకు ఈ చక్కటి అవకాశం కల్పిస్తూ.. వెన్నుదన్నుగా నిలిచిన ముదినేపల్లి మండలం నాయకులకు ప్రతి ఒక్కరికి, సభకి విచ్చేసి విజయవంతం చేసిన వందలాది మంది కైకలూరు నియోజకవర్గం నాయకులకు, జనసైనికులు, వీరమహిళలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-5.25.18-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-5.25.17-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-5.25.18-PM-1024x768.jpeg)