కురుపాం నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం
విజయనగరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం రెండోరోజైన, శనివారం క్రియాశీలక సభ్యత్వాలు చేసిన క్రియాశీలక సభ్యులకు,విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గం,పెదమేరంగి గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ లు గా విజయనగరం జిల్లా విచ్చేసిన జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శిలు గడసాల అప్పారావు, శ్రీమతి ప్రియా సౌజన్య, విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి చేతులు మీదుగా బీమా పత్రాలు ప్రదానం చేశారు.
ముందుగా రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కురుపాం జనసైనికుల ఉత్సాహన్ని చూస్తుంటేనే మన జనసేన గెలుపు ఖాయమని తెలుస్తుందని, ఇదే ఉత్సాహంతో మనం అధికారం లోకివస్తే మనం ప్రజలకు ఏమి చేయబోతున్నామో చెప్పండని అంటూ, ఇంటికి పెద్దన్నలా మన అందరికి భీమా సౌకర్యాన్ని కల్పించిన మన అధినేత పవన్ కళ్యాణ్ కు మనమంతా రుణపడి ఉండాలని, మరెన్నో క్రియాశీలక సభ్యత్వాలు చేయించాలని అన్నారు. మరో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు మాట్లాడుతూ సరికొత్త రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని, యువత భవిష్యత్ కోసం తన బంగారు జీవితాన్ని త్యాగం చేసారని, పవన్ కళ్యాణ్ ఆశయాలు, మన జనసేన సిద్దాంతాలు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం కురుపాం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాలు చేసిన జనసైనికులను భీమా కిట్లు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారీగా నియోజకవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు, జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-9.51.22-PM-1024x664.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-9.51.21-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-9.51.20-PM-1-1024x461.jpeg)