ఐరాల మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

పూతలపట్టు: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలో బుధవారం క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసైనికులతో కలిసి జనసేన పార్టీ విధివిధానాలను వివరించి, పార్టీకి అండగా ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చడానికి నాయకులుగా ఎదగాలని కోరడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం తమ బాధ్యత అని, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని అక్కడ ఉన్న ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మండల అధ్యక్షులు పురుషోత్తం కార్యదర్శి మహాలక్ష్మి సీనియర్ నాయకులు మోహన్, తిరుమలేష్, సుధా తదితరులు పాల్గొన్నారు.