ఎమ్మిగనూరు ఇన్చార్జి రేఖ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

ఎమ్మిగనూరు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రేఖ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు జిల్లా కార్యదర్శి భాస్కర రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రధాన మత్స్యకార విభాగం నాయకులు టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు ని సన్మానించటం జరిగినది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జనసేన పార్టి క్రియాశీలక సభ్యత్వం పై ఎమ్మిగనూరు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రవిప్రకాష్, జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మీడియా ఇంచార్జ్ గానిగ భాష, జనసేన నాయకులు కర్ణం రవి, మునిస్వామి గోపి రమేష్ మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.