Amudalavalasa: జనసేన కార్యకర్తలు నిర్మించిన పార్కును స్పీకర్ ప్రారంభించడంపై జనసైనికుల అసంతృప్తి

చీమలు పెట్టిన పుట్టలు పాములు దోచుకున్న చందంగా వైసీపీ నాయకుల ప్రవర్తన ఉందని జనసేనపార్టీ ఆముదాలవలస నియోజకవర్గ నాయకులు శ్రీ పెడాడ రామ్మోహన్ ఆరోపించారు. జనసేన కార్యకర్తలు నిర్మించిన పార్క్ ను అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలోని బూర్జ మండల, ఓవీ పేటలో జనసైనికులు మరియు గ్రామానికి చెందిన యువకులు సమకూర్చుకున్న నిధులతో మరమ్మతులు చేసిన పార్క్ ను స్పీకర్ ప్రారంభించారు. ఈ అంశంపై నిలదీసేందుకు వచ్చిన శ్రీ పెడాడ రామ్మోహన్ తో పాటు జనసైనికుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే శిలాఫలకం తొలగించే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాంబాబు, కృష్ణ, కిషోర్, అప్పన్న, కొత్తరోట నాగేంద్ర, రమేష్, మురళీ మోహన్, గణేష్, పవన్ కుమార్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.