పుంగనూరు పట్టణంలో జనసేన, టీడీపీ ఇంటింటి ప్రచారం

పుంగనూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి పుంగనూరు పట్టణం నందు పర్యటనలో భాగంగా జనసేన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం చేస్తూ మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రజలే చెప్పడం, వారి సమస్యలను కూడా ఉమ్మడి ప్రభుత్వం రాగానే తీర్చే ప్రక్రియలు ప్రజలకు అభ్యర్థి భరోసా ఇవ్వడం జరిగింది. అధికంగా పట్టణంలో తాగునీటి సమస్య, మురికివాడలు, చిరు వ్యాపారుల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, తెలుసుకుంటూ ప్రచారం సాగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సిరివెలు చిన్నా రాయల్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.