నష్టపోయిన శనగ రైతుకి జనసేన అండ

  • ఉప్పలదిన్నె గ్రామంలో కనపర్తి మనోజ్ కుమార్ పర్యటన
  • వ్యవసాయ అధికారి పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు
  • పొన్నలూరు మండలంలో ప్రతి వ్యవసాయ రైతులకు అండగా జనసేన..

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో మండల జనసేన అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ బృందం ప్రతి గ్రామాన్ని పర్యటిస్తూ నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ, వారికి నష్టపరిహారం అందిందో లేదో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ దీనిలో భాగంగా బుధవారం ఉప్పలదిన్నె గ్రామంలో పర్యటించడం జరిగింది. ఉప్పలదిన్నె గ్రామంలో కొండ్రగుంట నరసయ్య అనే వ్యవసాయ రైతు 40 ఎకరాలు శనగ వేయడం జరిగింది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షానికి 20 ఎకరాలు శనగ పంట నష్టం జరిగింది, కొండ్రగుంట నరసయ్యకు జనసేన పార్టీ అండగా ఉంటూ, వారిని మండల వ్యవసాయ శాఖ అధికారి పూర్ణచంద్రరావు వద్దకు తీసుకొని వెళ్లి, పంట నష్టం గురించి వివరించడం జరిగింది. ఈ సమస్యపై పూర్ణచంద్రరావు గారు వెంటనే స్పందించి వివరాలు తెలుసుకొని, కొండ్రగుంట నరసయ్యకు ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ రోజు నుండి పొన్నలూరు మండలంలో ప్రతి గ్రామంలో వ్యవసాయ రైతులను పరామర్శిస్తూ వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.