ఆత్మహత్య చేసుకున్న రైతుకు జనసేన అండ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-14-at-10.19.58-PM-1024x768.jpeg)
పెడన మండలం, పుల్లపాడు పంచాయితీ , దేవరపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు పాము నందియ్య, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పెడన జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ ఆదేశాల మేరకు, నందియ్య, కుటుంబానికి అండగా రామ్ సుధీర్ సహకారంతో జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం అందచేయడం జరిగింది. ఈ ఆర్ధిక సాయాన్ని పెడన జనసేన కార్యకర్తలు, దాసరి ఉమా సాయి రామ్, సయ్యద్ షఫీ, బాదం వినోద్, అంజిబాబు మరియు దేవరపల్లి జనసైనికులు ప్రసాద్, మోహన్ బాధిత కుటుంబానికి అందచేశారు.