ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి జనసేన అండ

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం శనివారం రాజవరం గ్రామంలో జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీగా పోటీ చేసిన చాపల. శ్రీను భార్య అనారోగ్యంగా ఉండటం వలన వారు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన గ్రామ నాయకులు 50,000 మరియు నిత్యవసర సరుకులు అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీను, ఉపాధ్యక్షులు చిన్ని, వార్డ్ మెంబర్ సూరి బాబు, రాంబాబు తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.