భర్త చేతిలో హింసకు గురవుతున్న బాధిత మహిళకు జనసేన అండ
భర్త చేతిలో చిత్ర హింసకు గురవుతున్న మహిళకు అండగా జన సైనికులు నిలబడ్డారు.
పాడేరు నియోజకవర్గం కోట్లగురువు ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ వీరమహిళ భారతిని భర్త చిత్రహింసలు గురి చేయడమే కాక మరొక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు సన్యాసపాలెం గ్రామానికికి చెందిన దిలీప్ అనే వ్యక్తి. భారతికి ఇద్దరు పిల్లలు ఉండడంతో న్యాయం కోసం జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. దీనికి పై బాధిత మహిళ జన సైనికులతో కలిసి హుకుంపేట మండలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తోడు ఉంటుందని కు ధైర్యం చెప్పడం జరిగింది. జనసైనికులు పాడేరు మండల ప్రెసిడెంట్ నందోలి మురళి క్రిష్ణ, ఘ్. మాడుగుల మండల జనసేన నాయకులు మసాడి సింహచలం, ఏక్ష్ ఎంపీటీసీ పాడేరు నాయకులు అనిల్ కుమార్ లు భారతికి దైర్యం చెప్పి, న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-05-at-10.08.57-PM-1024x461.jpeg)