ధర్మవరంలో అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి జనసేనాని అండ
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరంలో శ్రీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. శ్రీ రాజశేఖర్ రెడ్డి మరణానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య శ్రీమతి చంద్రకళకు అందజేశారు. రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి విద్య బాధ్యతలను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఏసీ సభ్యులు నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి. వరణ్ తదితరులు పాల్గొన్నారు.
![Avatar](https://janasenanewssletter1.blob.core.windows.net/images/fad3113f-8edc-4b6e-9a75-3a8848b32bab.jpeg)