అక్రమంగా తొలగించిన షాపు యజమానులకు జనసేన అండ

పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం, ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా గుణ్ణంపల్లి గ్రామాములో నేషనల్ హైవే పక్కన పోలవరం కాలువ గట్టుపై చిన్నపాటి టిఫిన్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న భీమడోలు రాములు, బార్బర్ షాప్, డ్రింక్ షాప్ సుమారుగా 7 షాపులని ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అండదండలతో షాపులను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయుకులు, మండల నాయకులు జరిగిన స్థలాన్ని పరిశీలించి, జనసేన పార్టీ ఆ షాపు యజమానులకు అండగా ఉంటుందని, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జి యాంట్రపాటి రాజు వాళ్లకు హామీ ఇచ్చారు. అలాగే ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చిన్న బాబు, రాష్ట్ర జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ ల దృష్టికి తీసుకెళ్తానని యాంట్రపాటి రాజు బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్లజర్ల జనసేన మండలం అధ్యక్షుడు బాపిరాజు, దేవరపల్లి మండలం అధ్యక్షులు గణేష్ జనసేన నాయకులు నరసింహ మూర్తి, రుద్ర శ్రీను, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.