వై కోటలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి ‘516’ ప్రకటించిన జనసేన

వై కోట క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కు జనసేన పార్టీ తరపున రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ మలిశెట్టి వెంకటరమణ ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గిఫ్ట్ ప్రైజ్ మనీ ₹516 రూపాయలు ప్రకటించారు, ఈ గ్రౌండ్లో దాదాపు 90 మ్యాచ్ లో పైగా జరుగుతున్నాయి శనివారం ఉదయం 14వ మ్యాచ్ మధ్యాహ్నం 15వ మ్యాచ్ జరిగింది, ప్రతి మ్యాచ్ కు ₹516రూపాయలు గ్రామస్తుల చేతుల మీదుగా అందచేయడం జరిగింది. దాదాపు ₹46,440 అందజేసి ప్రతిరోజు వైకోట గ్రౌండ్లో లో జనసేన పేరు ప్రతి ధ్వనింపచేస్తూ ముందుకు దూసుకుపోతున్న టీం జనసేన వై కోట యువతకి గ్రామస్తులు, ప్రేక్షకులు, ఆడటానికి వచ్చిన ప్లేయర్లు ధన్యవాదాలు అభినందనలు తెలియచేస్తున్నారు.