దివ్యాంగులకు జనసేన భరోసా

కాకినాడ, దివ్యాంగులను జనసేన ఆదుకుంటుందని జనసేన నగర పార్టీ నాయకులు స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో దివ్యాంగులు అనుభవిస్తున్న బాధలను వారు తెలుసుకొని వారికి బట్టలతోపాటు కొంత నగదును సహాయంగా అందించి వారికి ఆసరాగా నిలిచారు. కాకినాడ కొండయ్య పాలెంలో నివసిస్తున్న దివ్యాంగులు గాంగేయుల వీర వెంకట సత్యనారాయణ, గారపాటి నాగేశ్వరరావులతోపాటు కొయ్య లోవరాజు, వై సత్య భవాని శంకర్, జి.సత్యనారాయణలకు నగర జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో దివ్యాంగుల కార్యక్రమ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ చోడిశెట్టి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఈ సహాయాన్ని బుధవారం అందించారు. ఈ సందర్భంగా సహాయం అందుకున్న దివ్యాంగులు గాంగేయుల, గారపాటిలు మాట్లాడుతూ తమకు నెలకు వైద్య ఖర్చులు నిమిత్తం సుమారు 3వేల రూపాయల నుండి 5వేల వరకు ఖర్చు అవుతుందని తాము లోపం ఉన్నందువల్ల ఏ పని చేసుకోలేకపోతున్నామని జనసైనికుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జనసేన నాయకులు వారు చెప్పిన విషయాలను విని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నాయకులకు తెలియజేస్తామని బదులిచ్చారు. దివ్యాంగులకు జనసేన అండగా ఉంటుందని వారు భరోసా కల్పించారు అనంతరం వారికి బట్టలు, నగదును శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో బహుకరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రామిరెడ్డి నగేష్, గడ్డం దుర్గాప్రసాద్, ముమ్మిడి గంగాధర్, రాయుడు దేవి, గుజ్జు రాజేష్ రెడ్డి, నిమ్మకాయల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.