అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి జనసేన భరోసా

ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం, కారేపల్లి చీమలపాడులో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి తదుపరి అగ్నిప్రమాద బాధితుల కుటుంబాన్ని పరామర్శించి, వీడియో కాల్ ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడించి వారికి అండగా నిలబడతామని తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తల్లూరి, రాధారం రాజలింగం, వీర మహిళా విభాగం కావ్య, శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ డా.మాధవరెడ్డి, పఠాన్ చెరు కో ఆర్డినేటర్ రాజేష్, ఖమ్మం కో ఆర్డినేటర్ రామకృష్ణ, ఎల్ బీ నగర్ కో ఆర్డినేటర్ శిరీష మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగినది.