మెడికల్ క్యాంపులో జనసేన

కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆరోగ్య సిబ్బంది (మెడికల్ అధికారులు) గ్రామానికి విచ్చేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ అధికారులు పిలుపుమేరకు జనసేన పార్టీ తరపున ఈ మెడికల్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా హెచ్ఐవి వైరస్ గురించి ప్రత్యేక సిబ్బంది మన గ్రామానికి రావడం జరిగింది. హెచ్ఐవి వైరస్ గురించి వివరించి తగుజాగ్రత్తలు పాటించమని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలేపల్లి ఏసుబాబు మరియు భీమరాజు గోవిందు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.