పెండ్యాల గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం
కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. పెండ్యాల గ్రామ నాయకులు గౌసు భాషా ఆహ్వానం మేరకు కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ పాల్గొన్నారు. జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అణగారిన వర్గాల కోసం జనసేన పార్టీని నిర్మించడం జరిగింది మనమందరం జనసైనికులు గ్రామ నాయకులు పార్టీని బలోపేతం దిశగా మనం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని గ్రామాల్లో ప్రజల పక్షాన మనం పోరాడాలని, మన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని, మండల అధ్యక్షులు సతీష్ అన్నారు. అలాగే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని, జనసైనికులు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ నాయకులు గౌస్ భాషా మాట్లాడుతూ మేమంతా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తామని పార్టీని బలోపేతం చేస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయి హేమంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-25-at-2.44.03-PM.jpeg)