గంగినీడు పాలెంలో జనసేన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

పోలవరం: టి. నరసాపురం మండలం, గంగినీడు పాలెం గ్రామంలో ఎన్నారై వెజ్జు సత్య స్వగృహమునందు మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడినది. వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఇటువంటి లాభా పేక్ష లేకుండా, నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నచ్చి ఎల్లప్పుడూ పార్టీ వెంటే ఉంటూ నడుస్తున్న వెజ్జు సత్య గారిని కలవడం చాలా ఆనందదాయకమని, మీ సేవలు మరిన్ని అందించాలని, వారు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, సుబ్రహ్మణ్యం, తోట సాయి, ఆదిత్య, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.