దిగ్విజయంగా ఎల్బినగర్ కి జనసేన భరోసా బహిరంగ సభ

తెలంగాణ, ఎల్బినగర్: జనసేన పార్టీ ఎల్బినగర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కి జనసేన భరోసా భారీ బహిరంగ ఆదివారం కర్మన్ ఘాట్ లో నిర్వహించడం జరిగింది. వందలాదిగా ప్రజలు హాజరై తమ కష్టాలను జనసేన పార్టీకి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథులుగా తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమురి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం హాజరయ్యారు. శిరీష మాట్లాడుతూ నియోజకవర్గం ఎన్నో రోజుల నుండి భూ కబ్జాలకు, దోపిడీకి గురైందని, ఒక్క సారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తే కబ్జాలకు గురైన భూములు అవసరమైన పేదవారికి ఇస్తామని జనసేన భరోసా ఇస్తుందని తెలియజేశారు. అలానే ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడానికి ప్రజల వివిధ ఆఫీస్ లు వెళ్లకుండా ఒక సింగిల్ విండో ఛానల్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ పథకాలు అక్కడే అప్లై చేస్కునే విధంగా జనసేన భరోసా ఇస్తోంది అన్నారు. జనసేన పార్టీ ఓటుకు డబ్బులు ఇవ్వదని కాకపోతే ఆకలి అన్న కడుపును మాత్రం నింపి పంపిస్తుంది అని అన్నారు. రాజలింగం మాట్లాడుతూ ఎల్బి నగర్ నియోజకవర్గ ప్రజల కోసం శిరీష ఎంతో కష్టపడుతున్నారని, ఆమెకి ఒక్కసారి అవకాశము ఇస్తే మీ తరుపున అసెంబ్లీలో బలమైన గొంతుక అవుతుందని అన్నారు. శంకర్ మాట్లాడుతూ శిరీష గారిని స్థానిక ఎమ్మేల్యే ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారని అన్నారు. సభ జరగకుండా బెదిరింపు కాల్స్ చేశారని చెప్పారు. ఆమెని ఎన్ని భయబ్రాంతులకు గురి చేసిన తగ్గే వ్యక్తి కాదని ఆమెకి ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు పైన కూర్చుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ కమిటీ సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, లిఖిత, రత్న పిల్లా, నియోజకవర్గ ఇంచార్జిలు మరియు కో ఆర్డినేటర్ లు లక్ష్మన్ గౌడ్, రామ కృష్ణ, మాధవ రెడ్డి, బండి నరేష్, వెంకట చారీ, శివ కార్తిక్, మరియు రాష్ట్ర నాయకులు అబిద్, సాయి కిరాన్ రెడ్డి, రాములు హాజరయ్యారు. అదేవిధంగా ఎల్బి నగర్ నియోజకవర్గ నాయకులు శ్యామ్, చైతన్య, గౌతమ్, అక్షయ్, శ్రీను, సురేందర్, బద్రి, బ్రహ్మాజీ, భాస్కర్, గోపాల కృష్ణ, రక్షిత్, గుడిసె గౌతమ్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.