వజ్రకరూర్ లో జనసేన బైక్ ర్యాలీ
- జన ఘోష-జనసేన భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అచ్చనాల కేశవ్
ఉరవకొండ నియోజకవర్గం: వజ్రకరూర్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అచ్చనాల కేశవ్ ఆధ్వర్యంలో తలపెట్టిన జన ఘోష-జనసేన భరోసా అనే కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత వజ్రకరూర్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే పార్టీ చేసిన కార్యక్రమాలు మరియు పార్టీ చేయ పోయే కార్యక్రమాల గురుంచి తెలియ జేసారు. ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, వీడ్పనకల్ అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షుడు హరిశంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, గణేష్, ఆంజినేయలు కార్యదర్శి సూర్యనాయక్ పార్టీ నాయకులు దేవేంద్ర, నరేంద్ర, భోగేష్, మణి, మహేష్, బద్ర, రమేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-31-at-6.40.28-PM-1-1024x768.jpeg)