మదనపల్లెలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లెలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి మరియు జనసేన పార్టీ ఇన్చార్జ్ స్వాతి ఆధ్వర్యంలో శనివారం బర్తడే కేక్ కట్ చేసి మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిజాయితీ పరుడు, నిస్వార్థ పరుడు, ధైర్య వంతుడైన పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలలో నడవడం చాలా గర్వంగా ఉందని గంగారపు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబిరంలో దాదాపుగా 300 మందికి పైగా రక్తం దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, మదనపల్లి రూరల మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు జగదీష్, లక్ష్మినారాయణ, తోట కళ్యాణ్, నగేష్, మోహన కృష్ణ, అర్జున కుమార్, నవాజ్, పద్మావతి, జంగాల గౌతమ్, జై, పవన్, నాగవేణి, శంకర తదితరులు పాల్గొన్నారు.