రొద్దం మండలంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు యు.గంగాధర ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. రోద్దం బస్ స్టేషన్లో ఐదు వందల మందికి అన్నదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో బుచెర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షులు యు.గంగాధర హాజరయ్యారు. తర్వాత చెట్లు నాటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.