యాదమరి మండలంలో జనసేనాని జన్మదిన వేడుకలు

పూతలపట్టు, యాదమరి మండలంలోని పుల్లయ్య పల్లి గ్రామంలో గల అనాధ శరణాలయంలో పిల్లల మధ్య, మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పిల్లలు పవన్ కళ్యాణ్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ దైవ స్వరూపులైన పిల్లల మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, భావి భారత పౌరులైన పిల్లల్లో పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని నింపాలని అక్కడ ఉన్న ఉపాధ్యాయులను కోరడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు జనసైనికులు సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇంకా మండల ప్రధాన కార్యదర్శులు వేముల పవన్, చంద్ర, ఢిల్లీ సుల్తాన్, చిరంజీవి మరియు భారీ ఎత్తున జనసైనికులు పాల్గొనడం జరిగింది.