గ్రామసభలో గ్రామసమస్యలను అధికారుల దృష్టికి తేసుకెళ్ళిన జనసేన

అమలాపురం, కామనగరువు గ్రామపంచాయతీ గ్రామసభలో పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది.
1.బాలయోగి కాలనీ, అబ్బిరెడ్డి రామదాసు కాలనీలలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్య.
2.ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని.
3.గ్రామంలో ఉన్న ప్రతి ఏరియా లో రోడ్ల సమస్య.
4.గ్రామంలో ప్రతి వార్డ్ లో డంపిగ్ యార్డ్ సమస్యల మీద మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామనగరువు జనసేన పార్టీ నాయకులు గొలకొటి చిన్న, పాలురీ నారాయణ స్వామి 12వ వార్డు మెంబర్ చందాల సతీష్, జనసైనికులు పాల్గొనడం జరిగింది. జనసైనికులందరూ విధిగా గ్రామ సభల్లో పాల్గోని పంచాయతీ పరిధిలోని సమస్యలపై గళమెత్తాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు శ్రీ పడమట చిట్టి బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.