గురజనాపల్లి గ్రామంలో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

కాకినాడ రూరల్ నియోజవర్గం, కరప మండలం, గురజనాపల్లి గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఇంచార్జ్ శ్రీ పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లోకి జనసేన సిద్ధాంతాలను జనసేన మేనిఫెస్టో గల క్యాలెండర్ ను గ్రామంలో, గ్రామం మొత్తం ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ భోగిరెడ్డి కొండబాబు, కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ బండారు మురళి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భోగిరెడ్డి గంగాధర్, గురజనాపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు శిరిగినీడి సత్తిబాబు, ఎంపిటిసి శ్రీమతి యండమూరి వీరవేణి, సుందర సత్తిబాబు, శర్మ, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, గ్రామ జనసేన జనసైనికులు పాల్గొన్నారు.