ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని కైకలూరు పిలుపునిచ్చిన జనసేన

కైకలూరు నియోజకవర్గం, స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఈనెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్(బాబి) సభాధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కైకలూరు నుండి పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆవిర్భావ సభకు మచిలీపట్నం కార్యకర్తలు తరలిరావాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆవిర్భావ సభలో గోడపత్రికను జనసేన పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఆహ్వాన కమిటీ సభ్యులు నల్లగోపుల చలపతి నాని కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావ సభ పరిశీలకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి చంద్రశేఖర్, వేల్పూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుట్ట కనకదుర్గ, కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి తోట లక్ష్మీ, ముదేనపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, కైకలూరు మండల ఉపాధ్యక్షులు సొంటి రాజేశ్వరి, జనసేన నాయకులు బోయిన రాజేష్, మోటపల్లి ఆంజనేయ ప్రసాద్, హనుమ పోకల కృష్ణ, చెన్నంశెట్టి చిన్న. దుర్గం శ్రీనివాస్, ముత్యాల తరుణ్ సాయి నాయుడు, తోట కార్తీక్, కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.