పెద్దాపురంలో ఊపందుకున్న జనసేన ప్రచారం

పెద్దాపురం పట్టణంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచారాన్ని పార్టీ అధిష్టానం సూచనల మేరకు ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా శనివారం పట్టణాధ్యక్షులు పొలమరశెట్టి సత్తిబాబు, జనసేన నాయకులు ఆధ్వర్యంలో తుమ్మల రామస్వామి పట్టణంలో ప్రతీ ఇంటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలను, అలాగే పవన్ రావాలి – పాలన మారాలి అనే నినాదంతో ప్రతీ వారిని కలవడం జరిగింది. దీనిలో భాగంగా స్థానిక కబాడి వీధిలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓబిలిశెట్టి గణేష్, కొత్త లచ్చబాబు, చిటికెల నారాయణమూర్తి, వంగలపూడి సతీష్, సుంకర సత్తిబాబు, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు. అనంతరం పెద్దాపురం మండలం, తాటిపర్తిలో జనసేన నాయకులు గోపు వల్లయ్య ఆధ్వర్యంలో విఘ్నేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించిన జనసేన – జనబాట కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తుమ్మల రామస్వామి (బాబు) పాల్గొన్నారు.