ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

  • గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్.
  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో..

గజపతినగరం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా జనసేన నాయకులు సురేష్ మర్రాపు ఆధ్వర్యంలో గజపతినగరం జనసైనికులు సమక్షంలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వ్యవస్థ మార్పుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారని, అయన ఆశయాలకు తగ్గట్టుగా భారత దేశంలోనే రైతు భరోసా యాత్ర పేరిట రైతులకు ఆర్ధికంగా ఆదుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పార్టీ బలోపేతంనకు ప్రతీ యొక్క జనసైనికులు, వీరమహిళలు పాటుపడాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రోజుకు ఒక సేవా కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించడం జరిగింది. ఆగష్టు 27నుండి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించామని, ప్రతీకార్యక్రమం ప్రజలతో మమేకమై, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధముగా నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ లో పార్టీ బలోపేతంనకు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు డా.మిడతాన రవికుమార్, గజపతినగరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.