జనసేన అధికారంలోకి రావడం ఖాయం: వేగుళ్ళ లీలకృష్ణ

మండపేట: ప్రజల పక్షాన ఉండి సమస్యలపై పోరాటం చేస్తామని జనసేన మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు. మండపేట జనసేన పార్టీ నిర్వహించిన క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా మండపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5,300 ల సభ్యత్వాలు నమోదు కావడం జరిగిందని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. ఈ క్రమంలో మండపేట పట్టణంలో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్ లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. జనసైనికుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల నుంచి యువకులు పోటా పోటీగా సభ్యత్వం లు నమోదు చేయించడంతో వేగుళ్ళ లీలాకృష్ణ వారందరినీ పూలమాలలు వేసి దుస్సాలువాతో సత్కరించారు. సన్మాన గ్రహీతలకు కిట్లు పంపిణీ చేసి, మిగిలిన సభ్యులు అందరికీ ఐడీ కార్డులు అందించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసిన కోరుమిల్లి గ్రామ యువకుడు తాడాలా రామకృష్ణను మిగిలిన వాలంటీర్లను అభినందించారు. జనసైనికులు అందరూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సరాకుల అబ్బులు, కుంచే దుర్గాప్రసాద్, ఉండమట్ల రామారావు, నామాల చంద్రరావు, వల్లూరి సత్య ప్రసాద్, రామలింగం, పెయ్యల యాకోబు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.