ప్రభుత్వం వసూలు చేస్తున్న చెత్త మీద పన్నుపై సచివాలయంలో జనసేన పిర్యాదు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-4.44.53-PM-461x1024.jpeg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యవసర సరుకులు రోజురోజుకూ ధరలు పెరుగుతూ ఉంటే దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చెత్త పన్ను అంటూ ప్రజల నుండి 60 నుండి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.. దీనివల్ల పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను జనసేన పార్టీ యువ నాయకులు 9 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి హుస్సేన్ ఖాన్ మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాలు, చక్రవర్తి, రవి రాజ్ చౌదరి, యోగేష్, జనసైనికులు భవాని తదితరులు కలిసి ఈ సమస్యపై స్థానిక సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.