మానవ బాంబు ట్వీట్ పై ఖండించిన జనసేన
![kusampudi srinivas: జనసేన అధికార ప్రతినిధి అరెస్ట్.. విద్వేషాలు రెచ్చగొట్టారంటూ..! - jana sena party spokes person kusampudi srinivas arrested due to alleged spreading false information | Samayam Telugu](https://static.langimg.com/thumb/msid-75383330,imgsize-66918,width-540,height-405,resizemode-75/samayam-telugu.jpg)
ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఓ నెటిజన్ పోస్టు పెడుతూ.. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా రెమ్యునరేషన్లో సగం పాతిక కోట్లు నాకే ఇస్తే, నా కుటుంబాన్ని జీవితాన్ని వదిలేస్తాను. మానవ బాంబుగా మారి జగన్ను లేపేస్తా అంటూ పోస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా అతనేంటి మా అన్నను తొక్కేది.. పేగులు మెడలో వేసుకొని తిరుగుతా.. పోలీస్ స్టేషన్కు వెళ్లి కూర్చొంటా అంటూ నెటిజన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకొంటూ చేసిన పోస్టుకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ డీపీ ఫోటో మహేష్ బాబు ఉండటం, అకౌంట్ పేరు బిజినెస్ మ్యాన్ అని పెట్టుకోవడం కొంత గందరగోళంగా మారింది. అయితే ఈ పోస్టుపై జనసేన పార్టీ వర్గాలు ఖండించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో ఎవరో ఇటువంటి పోస్టులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఇది జనసైనికుల పనికాదు అనేదే నా భావన. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి ఖండించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-10.01.24-PM-513x1024.jpeg)