తిరుపతి జిల్లా ఎస్పీ, కమిషనర్ లకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన

తిరుపతి, కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాకు విచ్చేసిన ఎస్పీ, కమిషనర్ లను కలిసి తిరుపతి శాంతిభద్రతలకు భంగం కలగకుండా, మత్తుపదార్థాలను అరికట్టే విధంగా, తిరుపతి పట్టణం నందు పారిశుధ్యం, తాగునీరు సమస్యల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారిని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ, కమిషనర్ లకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.