లావేరు మండలం: అస్వస్థతకు గురైన పిల్లలకు జనసేన పరామర్శ

లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని నేతేరు అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు, పాలు తీసుకున్న పది మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన వెంటనే ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీమతి కాంతిశ్రీ అక్కడికి చేరుకొని బాధిత పిల్లలని వాళ్ల కుటుంబాల్ని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వాళ్లకి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వట్లేదని, తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బార్నాల దుర్గరావు, సూర్య, బాబాజీ, సాయి, నిఖిల్, జయప్రకాశ్, తిరు తదితరులు పాల్గొన్నారు.