తాగునీరు సమస్యపై ఛైర్ పర్సన్ కు జనసేన కౌన్సిలర్లు ఫిర్యాదు

కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 6,7,9 వార్డులజనసేన కౌన్సిలర్లు వార్డుల్లో తాగు నీరు సమస్యపై ఛైర్ పర్సన్ కు ఫిర్యాదు చేసారు. అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంచి నీటి పైప్ లీకేజీ కారణంగా మంచి నీటి సమస్య ఏర్పడిందని, పురపాలక అధికారులు తెలియజేస్తే తాత్కలిక మరమ్మత్తులు చేసారని, అయినా తాగు నీరు సరిగా రావడం లేదన్నారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య మరింత ఎక్కువ అవుతుందన్నారు. వార్డులో ప్రజలు నీటి సమస్య పైతమకు విన్నవించి నట్టు తెలిపారు. ఛైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణిని కలిసిన వారిలో జనసేన కౌన్సిలర్లు పిండి అమరావతి (6వార్డ్), గండి దేవి హారిక (7వార్డ్), గొలకొటి విజయలక్ష్మి (9వార్డ్), వార్డుల ప్రజలు ఉన్నారు.