రైల్వే భూముల నిర్వాసితులకు జనసేన డిమాండ్

మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలంలోని ఇందిరానగర్ దగ్గర గల రైల్వే భూములలో 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న దాదాపు 1500 కుటుంబాలను రైల్వే అధికారులు తొలగించాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబ సభ్యులు 5 రోజుల నుంచి దీక్ష చేపట్టారు, దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ శేఖర్ బాధిత కుటుంబాలకు మద్దతు తెలుపటం జరిగింది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చిల్లపల్లి శ్రీనివాసరావు బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.