రోడ్డును సక్రమంగా నిర్మించాలని జనసేన డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, పెదబయలు మండలం సిరసపల్లి గ్రామ జంక్షన్ నుంచి తోటల గొంది గ్రామము సుమారు 8 కిలోమీటర్ల వరకు ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా వేసిన రోడ్డు సంవత్సరం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకుంది. కారణాలు ఏమిటనగా రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ నాణ్యత లోపమైన పనుల కారణంగా నేడు ప్రజారవాణకు ప్రధాన రహదారి ఇలా శిథిలావస్థకు చేరుకోవడం ఎంతో విచారకరం. ఈ విషయమై సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు కల్పించుకుని ఈ నాణ్యతాలోపమైన రోడ్డును తిరిగి ఇంకోసారి పనులు చేపట్టి రోడ్డును సక్రమంగా నిర్మించాలని, అవినీతికి తావులేకుండా నాణ్యమైన రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నామని పెదబయలు మండల జనసేనపార్టీ మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, జనసైనికులు నాగరాజు, చిన్న, సుమన్ డిమాండ్ చేస్తున్నామని త్వరలోనే సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.