మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని జనసేన డిమాండ్

కొత్తగూడెం, జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వేముల కార్తీక్ ఆదేశాల మేరకు పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు వారు చేసే సమ్మెకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని మరియు వారికి తగిన వేతనం ఇవ్వాలని జనసేన పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వారికి పూర్తి మద్దతు తెలుపుతూ వారి సంఘీభావం తెలియజేడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు, జి.సంపత్ రామ్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ బి.సత్యనారాయణ, ఆర్గనైజర్ సెక్రెటరీ పి.బాలాజీ, ఆర్గనైజర్ సెక్రటరీ ఆర్.సంపత్ కుమార్ సెక్రటరీ యు.ప్రదీప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జె.జోషి బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాంగోపాల్ వర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి.వీరేందర్, యు.రమేష్ తదితరులు పాల్గొన్నారు.