విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని జనసేన డిమాండ్

గుడివాడ ప్రధాన రహదారి ఏజికె స్కూల్ సెంటర్ వద్ద బూరగడ్డ శ్రీకాంత్(ఇంచార్జి) ఆధ్వర్యంలో రంగా విగ్రహం ముందు నిరసన చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
గుడివాడలో రంగా పేరు చెప్పి మంత్రి కొడాలి నాని విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. కావున విజయవాడకి రంగా పేరు పెట్టే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున కులాలు మధ్య గొడవలు సృష్టించే విధంగా ఉంది ప్రభుత్వ చర్యలు అని విమర్శించారు. కావున మంత్రి కొడాలి నాని మీరు జిల్లాకి రంగా పేరు పెట్టి మీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర రావు(జిల్లా కార్యదర్శి), వేమూరి త్రినాధ్, తోట చిన్నారి(గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు), నల్లగాంచు రాంబాబు(కాపు సంఘం నాయకులు), పందిళ్ళ మల్లి(రాధా రంగా మిత్ర మండలి) జేమ్స్, షేక్ మీరా షరీఫ, కోలా రమణ, దుర్గారావు, రాజేష్, కొట్టే శివ, కంచర్ల మోషే, ఎస్ జనార్ధన రావు, ముత్యాల కోటి, సాయి పవన్, అంజి, తదితరులు పాల్గొన్నారు.