కిన్నాంగూడ గ్రామంలో డ్రైనేజీ నిర్మించాలని జనసేన డిమాండ్

*ఇంటింటికి జనసేన మాటలు,
*జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, రామకృష్ణ, అల్లంగి

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలో గల కిన్నాంగూడ గ్రామాల్లో శనివారం జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు, అయితే ఆ గ్రామంలో డ్రైనేజీ, సిసి రోడ్డు, హౌసింగ్ తదితర సమస్యలు ఉన్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు, ఈ సందర్భంగా జనసేన ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా, రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కిన్నాంగూడ గ్రామాల్లో నెలకొన్న డ్రైనేజీ తదితర సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం గ్రామాల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలని గ్రామస్తులతో ప్రభుత్వానికి తెలిసేలా నినాదాలు చేస్తూ, ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలిపారు, దీనికి ముందు గాను జనసేన బృందం ఇంటింటికి జనసేన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్తునే, డ్రైనేజీ ని పరిశీలించడం జరిగినది, ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.