మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని జనసేన డిమాండ్

ప్రకాశం జిల్లా, గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద.. మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయి బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అభివృద్ధికి నోచుకోని పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవహరించాలని ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు, కంభం మండల నాయకులు తిరుమల శెట్టి వెంకట్ రావు, పోలు ప్రసాద్ పాల్గొన్నారు.