నరసాపురం జిల్లాకు కేంద్రంగా నరసాపురం ప్రకటించాలని జనసేన డిమాండ్

నరసాపురం జిల్లాకు కేంద్రంగా నరసాపురం ప్రకటించాలని కోరుతూ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బొమ్మిడి నాయకర్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మూడు రోజులు ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. నరసాపురం జిల్లాకేంద్ర సాధన అఖిలపక్ష కమిటీ పిలుపుకై విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు బంద్‌ ప్రకటించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని బొమ్మిడి నాయకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.