బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన డిమాండ్

  • వైద్య ఖర్చులకు ఆర్ధికసాయం

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, పెనుగొండ మండలంలో బుధవారం పెనుకొండ పట్టణంలో మార్కెట్ రోడ్డు ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో రెండున్నర సంవత్సరాల చిన్నారిపై నరసింహులు 48 మానవ మృగం లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై జనసేన పార్టీ పెనుకొండ మండల అధ్యక్షులు మహేష్, రొద్దం మండల అధ్యక్షులు గంగాధర్, వీరమహిళ శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కాని వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో జనసేన పార్టీ ముందుండి పెద్ద ఉద్యమాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. అదేవిధంగా బాధ్యత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు అలాగే ఆ కుటుంబానికి వైద్య చికిత్సల కొరకు 2000 రూపాయలు జనసేన పార్టీ తరఫున సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల ఉపాధ్యక్షులు, మంజునాథ్, సురేష్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాబా, హరీష్, నాయకులు, ప్రసాద్, విజయ్, చిరంజీవి, నాగరాజ్, చలపతి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.