ఎన్.జి.ఆర్ పురం పంచాయతీ గ్రామ సమస్యలపై చర్చించిన జనసేన
ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, ఎన్.జి.ఆర్ పురం పంచాయతీ గ్రామ నాయకులు, జనసైనికులు వచ్చి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ ని కలిసి గ్రామపంచాయతీ సమస్యలు గురించి కాంతిశ్రీ కి తెలియజేసారు. అలాగే మత్య్సకారుల సమస్యలు గురించి పూర్తి స్ధాయిలో వివరించారు. శ్రీమతి కాంతిశ్రీ మాట్లాడుతూ… కొన్ని రోజుల్లో మీ పంచాయతీ పర్యటనకు వస్తానని అన్నారు. అలాగే ఆ సమస్యలను పూర్తి స్ధాయిలో తెలుసుకుంటాను. తెలుసుకొని సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామ అన్నారు. అని జనసైనికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కాకర్ల బాబాజీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-08-at-5.19.34-PM-1024x369.jpeg)