వరద బాధితులకు దుప్పట్లు పంచిన జనసేన
రంపచోడవరం, గోదావరి వరదలకు సర్వం కోల్పోయి ఇబ్బందుల పడుతున్న వి.ఆర్.పురం మండలం లోని ప్రజలకు జనసేన పార్టీ తరఫున గుంటూరుకు చెందిన చెరుకూరి సురేష్ కుమార్ నాగ భవాని ల ఆధ్వర్యంలో ధర్మతాళ్ళగూడెం, వి.ఆర్.పురం మరియు చొక్కనపెల్లి గ్రామాల్లో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగ భవాని మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మా వంతుగా సహాయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ మరియు వి.ఆర్.పురం జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-7.51.50-PM-1024x658.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-7.51.36-PM-1024x351.jpeg)