కిడ్నీ బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన

అరకు నియోజకవర్గం, అనంతగిరి మండల కేంద్రంలో గల కిడ్నీ బాధితుడు అమిటి లక్ష్మణరావును శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి, సన్యాసిరావు వారి ఇంటి వద్దకు వెళ్లి బాధితుడుని పరామర్శించడం జరిగింది. అనంతరం బాధితుడికి నిత్యావసర సరుకులు జనసేన పార్టీ పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ నాయకులు. ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితుడు అయిన లక్ష్మణరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ రత్న ప్రియ, అల్లంగి రామకృష్ణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.