విలేకరి కుటుంబానికి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య చేయుత
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-23-at-10.44.56-PM-1024x768.jpeg)
సింగనమల నియోజకవర్గం నార్పల మండలం విలేకరిగా పనిచేస్తున్న ప్రహ్లాద ఇటీవల ఓ ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య విలేకరి కుటుంబానికి చేయూతను అందించారు. ఆదివారం ప్రహ్లాద కుటుంబ సభ్యులకు రూ 5 వేలు ఆర్థిక సహాయం అందించారు. జనసేన పార్టీ ప్రహ్లాద కుటుంబానికి అండగా ఉంటుందని ఈశ్వరయ్య భరోసా ఇచ్చారు.